తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2025
వేదిక : వనపర్తి
సోమవారం జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి IAS ,ఎస్పీ రావుల గిరిధర్,వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య,వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు ముఖ్య అతిథిగా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతం హాజరయ్యారు.తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళి అర్పించి,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు.అనంతరం జయ జయ హే తెలంగాణ గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులకు,తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు.వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.