వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

అన్ని రంగాలలో మహిళ ముందుకు వెళ్లి సమాజాభివృద్ధికి కృషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ గారు అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ రక్షిత కే మూర్తి గారు కలిసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర ఉందని అన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని కలెక్టర్ గారు కోరారు ఆడపిల్లలను మంచిగా చదివించి ఉన్నత శిఖరాలు చేరేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. మహిళల విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని కలెక్టర్తె గారు లిపారు. ఎస్పీ రక్షిత మూర్తి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు మహిళలు వారి అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని అన్నారు. మహిళలు తలచుకుంటే కానిదేదీ లేదని ప్రతి మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధిలో మహిళలు ముందంజలో ఉండాలని ఎస్పి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సి డబ్ల్యూ సి అలివేలమ్మ గారు మాట్లాడుతూ స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆమె కోరారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఎస్ డబ్ల్యూ ఓ నిషిత గారు మాట్లాడుతూ ప్రతి మహిళ విజయం వెనుక భర్త సహకారం ఉంటుందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి శాయశక్తుల కృషి చేయాలన్నారు. మహిళలకు 33 శాతం నుండి 50% వరకు రిజర్వేషన్ కల్పించేలా సమిష్టిగా కృషి చేయాలన్నారు. డి ఆర్ డి ఓ నరసింహులు గారు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు చదువుకునేలా కృషి చేయాలన్నారు. శ్రీమతి పద్మావతి ఆర్డీవో గారు మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మహిళలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఆర్డిఓ తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులను కలెక్టర్ మరియు ఎస్పీ గారి చేత మీదుగా సర్టిఫికెట్లతో ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జడ్పీ సీఈవో, డి. డబ్ల్యూ. ఓ. రామ్ మహేశ్వర్ రెడ్డి,అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.