ముగించు

వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

1
ప్రారంభం : 26/11/2022 | ముగించు : 30/11/2022

రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125వ. జయంతి సందర్భంగా 2015, నవంబర్ 26వ. తేదీ నుండి “భారత రాజ్యాంగ దినోత్సవం” గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.

శనివారం ఐ డి ఓ సి. కార్యాలయం ప్రాంగణంలో “భారత రాజ్యాంగ దినోత్సవం” ను పురస్కరించుకొని జిల్లా అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1949, నవంబర్ 26వ. తేదిన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని ఆమె సూచించారు

1

భారత రాజ్యాంగాన్ని 1950, జనవరి 26వ. తేదిన ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవటం జరుగుతున్నదని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ”భారత దేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగాన్ని పాటించేందుకు కట్టుబడి ఉంటామని, సత్యనిష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు” జిల్లా అధికారులు, సిబ్బందిచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గొప్పతనాన్ని, సేవలను, హక్కులను, విధులను, బాధ్యతలను తూ.చా. తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని, పాటించాలని ఆమె సూచించారు. 

      ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి వేణుగోపాల్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.