గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.

వేదిక : Wanaparthy
వనపర్తి-గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఐఏఎస్., గారు అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారుల తో మాట్లాడారు. జిల్లాలో 970 క్లైమ్ వచ్చే అవకాశం ఉందని అన్నారు.
గ్రామాలలో ఎంపీవో ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.కమిటీలలో 10 నుంచి 15 మంది వరకు సభ్యులను కమిటీలో నియమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గారు, అటవీశాఖాధికారి,ఎంపీవోలు, తహసీల్దార్లు,డిఎల్ పిఓ,సర్వేయర్లు, మండల స్థాయి అధికారులు,అధికారులు పాల్గొన్నారు.